News December 10, 2024

ప.గో: నిధుల దుర్వినియోగం.. క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

యలమంచిలి మండలం చించినాడ పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీ జయరాజు రూ.14,94,224, ముత్యాలపల్లి సెక్రటరీ కృష్ణంరాజు రూ.1,99,50,956, చినఅమిరం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సుమనాగ్ రూ.15,98,455 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ నాగరాణి సోమవారం తెలిపారు. వీరిపై క్రిమినల్ చర్యల నిమిత్తం భీమవరం తాహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. నిధులు మళ్లింపుకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News November 20, 2025

30 గ్రామాల రీ-సర్వే తక్షణమే పూర్తి చేయాలి: జేసీ

image

జిల్లాలో రీ-సర్వే జరుగుతున్న 30 గ్రామాల డేటా ఎంట్రీని పూర్తి చేసి, వెంటనే సర్టిఫికెట్లు పంపాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం భీమవరం ఆయన మాట్లాడారు. భూ యజమానులకు కొనుగోలు, అమ్మకాలకు ఆటంకాలు ఉండకూడదన్నారు. థర్డ్ ఫేస్ రీ-సర్వేకు రైతులను రప్పించేందుకు తహశీల్దార్‌లు మరింత కృషి చేయాలని ఆదేశించారు. జీవో 30 భూముల పూర్తి నివేదికను అందించాలని ఆయన కోరారు.

News November 20, 2025

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేయాలి: జేసీ

image

రానున్న వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలలో వరి కోతలు ముమ్మరం కానున్న నేపథ్యంలో, ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేయాలని జేసీ రాహుల్ అధికారులను ఆదేశించారు. గురువారం జేసీ ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని పరికరాలను రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 20, 2025

జిల్లాలో గత 4 నెలలో 7,432 ఎపిక్ కార్డులు: కలెక్టర్

image

జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను పంపినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆమె వివరాలను వెల్లడించారు. ఓటు నమోదుకు వచ్చిన 3,334 దరఖాస్తుల్లో 2,800 దరఖాస్తులను ఆమోదించామని, 426 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయని, మరో 108 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.