News October 7, 2024

ప.గో.: నేటి నుంచి ప్రత్యేక రైలు

image

దసరా పండగను పురస్కరించుకుని నేటి నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఏలూరు రైల్వే
స్టేషన్ ఇన్‌ఛార్జి రమేశ్ తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, విజయవాడ, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు, 7, 8, 9వ తేదీల్లో విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి అనపర్తి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పొందూరు మీదుగా శ్రీకాకుళం వరకు నడపనున్నారన్నారు.

Similar News

News December 12, 2025

నరసాపురం నుంచి వందేభారత్

image

నరసాపురం – చెన్నైకి వందేభారత్ నడిచేందుకు ఈ నెల 15 న ముహూర్తం ఖరారయింది. ప.గో నుంచి ఇదే తొలిసారి కావడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ రైలు నరసాపురం – విజయవాడ మధ్య నరసాపురం, భీమవరం, గుడివాడలో ఆగుతుంది. కాగా ఇది నరసాపురంలో మ. 2.50కి బయలుదేరి రాత్రి 11.45కు చెన్నైకి చేరుతుంది. తిరిగి ఉ. 5.35కు బయలుదేరి మ.2.10కి నరసాపురంలో ఉంటుంది.

News December 12, 2025

భీమవరం: లింక్ క్లిక్.. సినిమా స్టైల్‌లో నగదు మాయం

image

భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ.1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ.90 వేలు ఫ్రీజ్ చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 12, 2025

ప.గో : ఇకపై వాహన చలానాలు ఇలా..!

image

వాహనదారులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్‌.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్‌ అనే టాబ్‌ ద్వారా వాహనం నంబర్ ఎంటర్‌ చేస్తే చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్‌లో చెల్లించి ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని సీఐ కొండయ్య కోరారు.