News July 6, 2024

ప.గో: ‘నేడే.. మర్చిపోకుండా టీకాలు వేయించండి’

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.

Similar News

News October 3, 2025

అత్యంత కిరాతకంగా చంపి… గోనె సంచిలో కుక్కి..!

image

తణుకులో అదృశ్యమై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శవమై తేలిన మడుగుల సురేశ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు సురేశ్‌ను హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి గోనె సంచిలో కుక్కి గోదావరిలో పడవేసినట్లు తెలుస్తోంది. న్యాయవాది సోదరుడి కారులో మృతదేహాన్ని తరలించారనే అనుమానంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News October 3, 2025

జిల్లాలో నేటి నుంచి 3వ పేజ్ రీ సర్వే: కలెక్టర్

image

జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News October 2, 2025

రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర అవార్డులు: కలెక్టర్ హర్షం

image

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో 1 రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. దేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ వివరాలను సాసా (SASA) పోర్టల్ https://sasa.ap.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.