News January 2, 2025
ప.గో: న్యూఇయర్ రోజున పలు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

న్యూ ఇయర్ రోజున ఉమ్మడి ప.గో(D)లో పలు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. బైక్లు ఢీకొనడంతో భీమవరంలో మహేశ్(18), మరో ప్రమాదంలో ముదినేపల్లిలో వెంకటేశ్వరరావు మృతి చెందారు. రైలు ఢీకొని ఏలూరులో ఓ వృద్ధుడు, మంటలు అంటుకుని టి.నర్సాపురానికి చెందిన సీతారావమ్మ, అతిగా మద్యం తాగి నూతిలో పడి ఏలూరులో శ్రీనివాసరావు, చెరువులో మునిగిపోయి చెరుకువాడలో పెద్దిరాజు మృతి చెందాడు. ఇరగవరంలో వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి.
Similar News
News February 24, 2026
పాలకొల్లు: మళ్లీ ‘ఫ్యాన్’ కిందకే మేకా.. సస్పెన్షన్ ఎత్తివేత?

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. తాడేపల్లిలో పార్టీ అధినేత జగన్ని ఆయన తన కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 9న జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరుకావాల్సిందిగా జగన్ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో శేషుబాబుపై గతంలో ఉన్న సస్పెన్షన్ను అధిష్ఠానం ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
News February 24, 2026
పీజీఆర్ఎస్కు 19 అర్జీలు: ఎస్పీ

భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
News February 24, 2026
పీజీఆర్ఎస్కు 19 అర్జీలు: ఎస్పీ

భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.


