News December 31, 2024

ప.గో: ‘న్యూఇయర్ వేడుకలను పేద విద్యార్థులతో జరుపుకుందాం’

image

నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని పేద విద్యార్థులతో జరుపుకుందామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసిల్వి, ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌లు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేస్తే వారి చదువులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

Similar News

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.

News December 12, 2025

సామాజిక చైతన్యానికి బాలోత్సవాలు: కలెక్టర్

image

బాలోత్సవాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యానికి సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఆటలు పాటలు ఉంటే చెడు మార్గం వైపు వెళ్లరని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ..సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు రకాల వ్యసనాలతో విద్యార్థి యువత పెడదోవ పడుతున్నారని అన్నారు.