News February 4, 2025
ప.గో: న్యూఢిల్లీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష

పీఎం లంక వద్ద సముద్రం కోత నిరోధానికి డిలైట్ కంపెనీ ప్రాజెక్టు పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ లో న్యూఢిల్లీలోని డిలైట్ ప్రతినిధులతో వర్చువల్గా సమావేశమై పీఎం లంక ప్రాజెక్టుపై సమీక్షించారు. పీఎం లంక వద్ద సముద్రపు కోత గురికావడంతో దానికి అడ్డుకట్ట వేసే ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరిందన్నారు.
Similar News
News March 14, 2025
రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు వాసి మృతి

రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు(M) గొల్లవాని చెరువుకు చెందిన సాయినరేశ్ (30) మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన రమేశ్ తో బొమ్మూరు వైపు వెళ్తుండగా.. వెనుకనుంచి కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గురువారం కుటుంబీకులకు బొమ్మూరు పోలీసులు అప్పగించి, కేసు నమోదు చేశారు. నరేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
News March 13, 2025
భీమవరం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

పశ్చిమ గోదావరి, గుంటూరు, తెనాలి, కృష్ణ, జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
News March 13, 2025
భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.