News January 16, 2025
ప.గో: పందెంలో మీకు ఏం వచ్చింది?

గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. కొందరు లాభ పడగా.. మరికొందరు ఎంతో నష్టపోయారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కార్లను సైతం కుదవ పెట్టేశారట. కొందరు నెల జీతం మొత్తాన్ని క్షణాల్లో పోగొట్టేసుకున్నారు. మరికొందరు స్థలాలను సైతం తాకట్టు పెట్టేశారు. మీ పరిధిలో ఎవరైనా ఇలా నష్టపోయారా? లాభపడ్డారా? తెలిస్తే కామెంట్ చేయండి.
Similar News
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 18, 2025
రైతు బజార్లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

భీమవరం రైతు బజార్లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.
News December 17, 2025
ప.గో: మరణంలోనూ వీడని బంధం

జీవితాంతం కలిసి నడిచిన ఆ దంపతులను మరణం కూడా విడదీయలేకపోయింది. తాడేపల్లిగూడెం (M) ఆరుగొలనుకు చెందిన మలకా అబద్ధం(75) అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. భర్త వియోగాన్ని తట్టుకోలేక బుధవారం సాయంత్రం భార్య లక్ష్మి(65) కూడా తుదిశ్వాస విడిచింది. దంపతులు ఇద్దరూ గంటల వ్యవధిలో మరణించడం గ్రామస్థులను కంటతడి పెట్టించింది.


