News February 5, 2025

ప.గో: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎర వేస్తారు

image

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు ఉమ్మడి ప.గో జిల్లాలోని యువత బానిసలవుతున్నారు. చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి రోడ్డున పడుతున్నారు. ఇటీవల భీమవరంలో ఓ చిరు వ్యాపారి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. అనంతరం అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, పిల్లలను పెద్దవారు నిత్యం గమనిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

News November 18, 2025

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.

News November 18, 2025

వి‘పత్తి’.. తగ్గిన దిగుబడి, పెరగని రేటు!

image

APలో ఇటీవల తుఫానుతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతోపాటు నాణ్యతా లోపించింది. దీంతో మద్దతు ధర అందడం లేదు. MSP ₹7,710-8,110 ఉండగా, ₹7వేల లోపే ధర పలుకుతోంది. CCI కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, శ్లాబుల వల్ల ఎదురుచూడలేక ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముతున్నారు. పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు. అటు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.