News August 10, 2024
ప.గో.: పేరెంట్స్ ప్రశ్నించినందుకు.. యువతి సూసైడ్

ఫోన్ మాట్లాడుతున్నావని పేరెంట్స్ ప్రశ్నించగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. నల్లజర్ల మండలం ఘంటావారిగూడేనికి చెందిన లక్ష్మి(18) ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓ మెడికల్ షాప్లో పనిచేస్తోంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలతచెందిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అమ్మానాన్నకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని కట్ చేసింది. వారు వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. కేసు నమోదైంది.
Similar News
News December 11, 2025
ఆకివీడు: రూ.5 వేలకే గ్రాము బంగారం అంటూ మోసం..!

ఆకివీడులో ఓ ముఠా గ్రాము బంగారం రూ.5 వేలకే ఇస్తామని నమ్మించి మోసానికి తెరలేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన భీమవరం, హైదరాబాద్ యువకులు ఆకివీడు వచ్చి రూ.2.50 లక్షలు చెల్లించారు. తీరా చూసుకుంటే అది నకిలీ బంగారమని తేలింది. బాధితులు తిరిగి వెళ్లి నిలదీయగా, రూ.1.20 లక్షలు వెనక్కి ఇచ్చి రాజీ కుదుర్చుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
News December 11, 2025
ఈనెల 15 న ప్రారంభం కానున్న నరసాపురం- చెన్నై వందేభారత్ రైలు

నరసాపురం నుంచి చెన్నైకు నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ రైలు భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి ,ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, మీదుగా ప్రయాణిస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక నెల ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
News December 11, 2025
బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలి: DCPO

బాలికల పట్ల లింగ వివక్ష విడనాడాలని ఏలూరు జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి సూర్య చక్రవేణి అన్నారు. బాల్య వివాహ్- ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల డిప్లొమా విద్యార్థులకు మహిళలపై హింస నిర్మూలన-బాల్య వివాహాలుపై అవగాహన కల్పించారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయరాదన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గ భవాని, విశాలాక్షి పాల్గొన్నారు.


