News June 5, 2024

ప.గో: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వివరాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తపాలా బ్యాలెట్‌ ఓట్ల సాధనలో కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు అత్యధికంగా 1,723 తపాలా ఓట్లు వచ్చాయి. పాలకొల్లు 1,643, తణుకు 1,593, తాడేపల్లిగూడెం 1,488, నరసాపురం 1,075, ఉండి 960, ఆచంట 973, నిడదవోలు1,090, కొవ్వూరు 1,023, గోపాలపురం 744 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.

Similar News

News October 15, 2025

పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

image

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News October 15, 2025

భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్‌కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.

News October 15, 2025

కర్నూలు జీఎస్టీ విజయోత్సవ సభకు జిల్లా నుంచి 400 మంది

image

కర్నూలులో ఈనెల 16న నిర్వహించనున్న ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 400 మంది ట్రేడర్లు, పన్ను చెల్లింపుదారులు (టాక్స్ పేయర్స్) హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న ఈ సభకు ట్రేడర్స్‌ను తరలించడానికి భీమవరం నుండి రెండు బస్సులు, పాలకొల్లు, తాడేపల్లిగూడెంల నుంచి ఒక్కో బస్సును ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.