News November 18, 2024

ప.గో: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో అమలు చేయనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేయడానికి వికేంద్రీకరణ చేశామన్నారు. సోమవారం నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవ్వాలన్నారు. ఈ మార్పును గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. 

Similar News

News November 17, 2025

భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

image

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.

News November 17, 2025

భీమవరం: దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రిక ఆవిష్కరణ

image

జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి దత్తత తీసుకొని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో దత్తత అవగాహన కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు లేదా ఎక్కడైనా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే గుర్తించి దత్తత ఇవ్వడానికి ప్రోత్సహించాలన్నారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు.

News November 17, 2025

నిమోనియాపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సీహెచ్ఓలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.