News February 15, 2025

ప.గో : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రోడ్డున పడ్డ కూలీలు

image

ప.గో జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభించి కోళ్ల యజమానులకు తీవ్ర నష్టం వాటిల్లుతోన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా జిల్లాలో తణుకులోని వేల్పూరు, ఉంగుటూరులోని బాదంపూడి, పెరవలిలోని కానూరు అగ్రహారం గ్రామాల్లో బర్డ్ ఫ్లూ తీవ్రత అధికంగా చూపింది. దీంతో సుమారు 40 ఫారాలు మూతలు పడగా.. పొట్టకూటికి వచ్చిన 3200 మంది కూలీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కష్టతరం కానుంది.

Similar News

News March 12, 2025

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకి తప్పిన ప్రమాదం

image

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశానికి హాజరై అనంతరం మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆయన కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. వర్మ కాలికి తీవ్ర గాయమైంది. వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఢిల్లీ నుంచి భీమవరానికి ఆయన బయలుదేరారు.

News March 12, 2025

భీమవరం పట్టణంలో బాంబు బెదిరింపు కలకలం

image

భీమవరం పట్టణంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కళాశాలకు బుధవారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాలేజ్ యాజమాన్యం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2025

హైదరాబాద్‌లో పోడూరు యువకుడు మృతి

image

పోడూరుకి చెందిన రోహిత్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. రోహిత్ తల్లి బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లారు. సమాచారం తెలియడంతో ఆమె స్వగ్రామానికి బయలుదేరారు. ఇటీవల భర్త మరణించగా ఆ బాధ నుంచి తెరుకోక ముందే కొడుకు మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని బంధువులు తెలిపారు. మృతదేహన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!