News July 20, 2024
ప.గో.: బాలికపై అత్యాచారం.. పదేళ్ల జైలు

ప.గో. జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం HYD వెళ్లింది. ఓ ప్రైవేట్ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తూ తన పిల్లలు బాలిక(11), బాలుడు(12)ని చదివిస్తోంది. 2018లో బాలికపై స్థానికుడు బ్రహ్మం(24) ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తాజాగా నిందితునికి పదేళ్ల జైలు, రూ.5లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News December 5, 2025
ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.
News December 5, 2025
నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.


