News July 27, 2024
ప.గో.: బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం

ఉండి మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు <<13715911>>అత్యాచారానికి<<>> పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆకివీడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, అతని స్నేహితుడు ఉప్పుటేరు వంతెన సమీపంలో రేకులషెడ్డులోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం శుక్రవారం పోలీసుల దృష్టికి వెళ్లగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
☛ ఏలూరులో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
తణుకులో సందడి చేసిన OG హీరోయిన్

సినీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సోమవారం తణుకులో సందడి చేశారు. స్వయంభు కపర్ధేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ భమిడి అఖిల్, ఘనపాటి భమిడి సీతారామకృష్ణావధానులు ఉన్నారు.
News November 24, 2025
ప.గో జిల్లాలో 70 మందికి అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి

ప.గో జిల్లాలో పని చేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్ గ్రేడ్ చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ అన్నారు. ఉండి నియోజకవర్గంలో 13 మందికి పదోన్నతి లభించిందన్నారు. సోమవారం పెద అమిరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందించారు. వీరికి వేతనం రూ 7. వేలు – రూ .11,500కి పెరుగుతుందన్నారు.


