News August 31, 2024

ప.గో: భారీ వర్షాలు.. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు

image

రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొన్ని రైళ్లను రూట్ మార్చినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. వాటి వివరాల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని హెల్ప్ లైన్ నెంబర్లను రైల్వే శాఖ ప్రకటించింది. భీమవరం టౌన్- 78159 09402, ఏలూరు- 78519 09348, తాడేపల్లిగూడెం-08818-226162, నిడదవోలు-08813-223325 నంబర్లకు సంప్రదించాలని పేర్కొంది.

Similar News

News December 2, 2025

పాలకొల్లు: ఏ తల్లికీ ఇలాంటి కష్టం రాకూడదు.!

image

పాలకొల్లులో కొడుకు చితికి తల్లి నిప్పు పెట్టిన విషాదకర ఘటన చోటుకుంది. బంగారువారి చెరువు గట్టుకు చెందిన సత్యవాణి కుమారుడు శ్రీనివాస్ తో కలిసి ఉంటోంది. భార్యతో విడాకులు తీసుకొన్న శ్రీనివాస్ మద్యానికి బానిసై అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయిన వాళ్లు లేకపోవడంతో తల్లి కైలాస రథంపై హిందూ శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూపరులను కలచివేసింది.

News December 2, 2025

ఏలూరు: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్

image

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీనియర్స్, జూనియర్స్ మధ్య వివాదం చెలరేగింది. కాలేజీ ఫెస్ట్‌కు సంబంధించి పనుల్లో భాగంగా సోమవారం 3rd ఇయర్ విద్యార్థులకు జూనియర్లకు మధ్య మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సీనియర్స్ తమపై ర్యాగింగ్ చేస్తున్నారని, రాత్రి సమయంలో బట్టలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని జూనియర్స్ ఆరోపించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ CI అశోక్ కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News December 1, 2025

మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.