News September 7, 2024
ప.గో.: భార్య చేపలకూర వండలేదని భర్త సూసైడ్

భార్య చేపల కూర వండలేదని అలిగి ఉరేసుకున్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు మొగల్తూరు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వివరాలు.. మండలంలోని ముత్యాలపల్లి చెందిన మైల సుబ్బరాజు (38) గత నెల 22న తన భార్యను చేపలకూర వండమని చెప్పారు. ఆమె వండకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబీకులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Similar News
News December 29, 2025
UTF జిల్లా అధ్యక్షుడిగా విజయరామరాజు

పశ్చిమగోదావరి జిల్లా UTF నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా ముగిసింది. జిల్లా అధ్యక్షుడిగా విజయరామరాజు, ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతికుమార్ వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. నూతన కార్యవర్గంలో మొత్తం 19మందిని వివిధ పదవులకు నియమించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులను UTF నేతలు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
News December 29, 2025
కలెక్టరేట్లో 221 అర్జీలపై కలెక్టర్ ఆరా!

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 221 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 29, 2025
ప.గో: కారుమూరితో సహా 13 మందిపై కేసులు

మాజీ మంత్రి కారుమూరి వెంక నాగేశ్వరరావుతో సహా 13 మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈనెల 25న తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లెక్సీల ఏర్పాటుపై జరిగిన వివాదంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరిపై 189(2), 329(2), 223(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు.


