News March 3, 2025

ప.గో : మద్యం దుకాణాలు బంద్

image

మరి కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీంతో ఆదివారం రాత్రి నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వాటిని తెరిచే ప్రసక్తే లేదని ఎన్నికల అధికారి, కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టి, అల్లర్లకు కారకులైతే కఠిన చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 28, 2025

నిర్మలా సీతారామన్‌కు సైకత శిల్పంతో స్వాగతం

image

నరసాపురం మండలం పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రామ అభివృద్ధి ప్రదాత నిర్మలా సీతారామన్‌కు సుస్వాగతం’ అంటూ రూపొందించిన సైకత శిల్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తీర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

News December 28, 2025

నరసాపురంలో నిర్మలా సీతారామన్ పర్యటన

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ హైస్కూల్‌‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాలలోని వసతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు.

News December 28, 2025

పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

image

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్‌ టైమ్‌ స్కేల్‌ (లెవల్‌-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.