News April 24, 2024

ప.గో.: మహిళపై అత్యాచారం.. జైలు

image

మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. కామవరపుకోట మండలం వీరిశెట్టివారిగూడేనికి చెందిన వితంతువుపై 2015లో అదే గ్రామానికి చెందిన నిజపరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అత్యాచారయత్నం చేసి పరారయ్యాడు. అప్పటి తడికలపూడి SIవిష్ణువర్ధన్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు. తుది విచారణ అనతరం ఏలూరు 5వ అదనపు జిల్లాజడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి ఈమేరకు తీర్పునిచ్చారు.

Similar News

News January 20, 2025

ఈనెల 20 నుంచి పశు ఆరోగ్య శిబిరాలు: కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్ పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

News January 19, 2025

టి. నరసాపురంలో బాలిక అనుమానాస్పద మృతి

image

టి.నరసాపురంలో బాలిక మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలానికి చెందిన బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే బాత్ రూమ్‌కి అని వెళ్లిన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు చింతలపూడికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 19, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో రూ. 120 కోట్ల మద్యం విక్రయాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులూ వైభవంగా జరిగాయి. అదే రీతిలో మద్యం ప్రియులు మద్యం కోసం ఎగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు , స్నేహితులు పండుగకు ముందుగానే పల్లె బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 120 కోట్లకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.