News January 16, 2025

ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.

Similar News

News February 18, 2025

ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

image

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్‌లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.

News February 18, 2025

తాడేపల్లిగూడెం: 21 వేల కోళ్ల ఖననం

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తూ, అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఫౌల్ట్రీలో అనుమానిత లక్షణాలు ఉన్న 21 వేల కోళ్లను అధికారులు ఖననం చేస్తున్నారు. పౌల్ట్రీ సమీపంలో గొయ్యి తవ్వించి వాటిని పాతిపెట్టారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించినట్లు కార్యదర్శి టి.రవిచంద్ తెలిపారు.

News February 18, 2025

భీమవరం: వివాహిత సూసైడ్

image

వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. శ్రీరామ్మూర్తి, నాగలక్ష్మికి 2018లో వివాహం జరిగింది. వీరికి బాబు, పాప ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ సోమవారం నాగలక్ష్మి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతోనే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని నాగలక్ష్మి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!