News June 22, 2024
ప.గో.: యాక్సిడెంట్.. పరీక్షకు వెళ్తుండగా మహిళ మృతి

పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పరిధిలోని చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన గీతావాణి(23) పెనుగొండలో MBA చదువుతోంది. ఈమెకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా.. పరీక్షల కోసం వారం క్రితం పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు బైక్పై వెళ్తుండగా లారీని ఢీ కొని చనిపోయింది.
Similar News
News December 3, 2025
పశ్చిమలో ‘కొబ్బరి’కి కొత్త కళ..

ప.గో జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో రూ.29.97 కోట్ల అంచనాతో చేపట్టనున్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో.. తొలివిడతగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి, బంగారం ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేందుకు మార్గం సుగమమైంది.
News December 3, 2025
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు తత్కాల్ అవకాశం: DEO

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 2 నుంచి 6 వరకు అవకాశం ఉందని డీఈవో నారాయణ తెలిపారు. విద్యార్థులు రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని అన్నారు. పూర్తి వివరాలను https://apopenschollo.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.
News December 3, 2025
కొబ్బరి రైతులకు ‘సీఎఫ్సీ’ వరం.. రూ. 2.24 కోట్లు మంజూరు

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్ పరిధిలో అత్యాధునిక కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.29.97 కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా కింద ఉన్న రూ. 4.49 కోట్లలో, తొలి విడతగా సగం నిధులు, అంటే రూ. 2.24 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


