News August 8, 2024
ప.గో: రూ.2లకే బిర్యానీ.. ఎగబడిన జనం

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్లో గురువారం రూ.2లకే బిర్యానీ ఇవ్వడంతో జనాలు భారీగా తరలివచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఈ ఆఫర్ ప్రకటించారు. 2 రోజులుగా దీనిపై ప్రచారం చేయడంతో బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. 2000 మంది వస్తే 200 బిర్యానీ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
Similar News
News November 17, 2025
ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
News November 17, 2025
పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


