News August 8, 2024

ప.గో: రూ.2లకే బిర్యానీ.. ఎగబడిన జనం

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో గురువారం రూ.2లకే బిర్యానీ ఇవ్వడంతో జనాలు భారీగా తరలివచ్చారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు ఈ ఆఫర్ ప్రకటించారు. 2 రోజులుగా దీనిపై ప్రచారం చేయడంతో బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. 2000 మంది వస్తే 200 బిర్యానీ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జాం అయ్యి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Similar News

News July 6, 2025

కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు పీజీఆర్ఎస్ జరుగుతుందన్నారు. అలాగే మీకోసం కాల్ సెంటర్ 1100 నంబర్‌కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 6, 2025

పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.

News July 6, 2025

ఈనెల 10న జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లాలో పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహించడం జరిగిందని, ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కూడా పీటీఎం సమావేశాలు నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.