News September 30, 2024
ప.గో: విషాదం.. కరెంట్ షాక్తో ITI విద్యార్థి మృతి

ప.గో జిల్లా ఆకివీడులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో సాయినగర్కు చెందిన యారపాటి హేమంత్(19) మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయినగర్లో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్కు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హేమంత్ ITI చదువుతున్నాడు.
Similar News
News December 10, 2025
పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి: కలెక్టర్

పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఇన్వెస్టర్లతో ముఖాముఖి మాట్లాడారు. నూతన పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బ్యాంకు రుణాల మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News December 9, 2025
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాం: కలెక్టర్

ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, దీనిలో భాగంగానే ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RJY)తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. తద్వారా ఉద్యాన రంగంలో మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందన్నారు.
News December 9, 2025
భీమవరంలో రూ.25 లక్షల విరాళం

భీమవరంలో నిర్మిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారుల భవన నిర్మాణానికి దాతలు సహకరించడం అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్ర రాజు అన్నారు. మంగళవారం పట్టణానికి చెందిన ఆనంద ఫౌండేషన్ రూ.25 లక్షలను భవన నిర్మాణానికి ప్రకటించింది. వారి కార్యాలయంలో రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర అధ్యక్షుడికి అందజేశారు. మిగిలిన వాటిని త్వరలో అందిస్తామన్నారు. వారికి రాష్ట్ర అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.


