News February 10, 2025
ప.గో: వేరు వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

ఉమ్మడి ప.గో జిల్లాలో ఆదివారం వేరువేరు ఘటనల్లో నలుగురు సూసైడ్ చేసుకున్నారు. ద్వారకాతిరుమల తిమ్మాపురానికి చెందిన సోమశేఖర్ (42) కడుపునొప్పితో, పెదవేగిలోని రాట్నాలకుంటకు చెందిన మరియమ్మ కొడుకు కాలేజీ ఫీజుకోసం దాచిన సొమ్ముతో భర్త మద్యం తాగేశాడని సూసైడ్ చేసుకుంది. అలాగే అనారోగ్యంతో దొంగలమండపానికి చెందిన మాధవి విషం తాగింది. వారితో పాటు పాలకోడేరుకు చెందిన యడ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.
Similar News
News April 17, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.
News April 17, 2026
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు

అనకాపల్లి జిల్లా పరిధిలో గురువారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 12:31 గంటల సమయంలో 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా? కామెంట్ చేయండి.
News April 17, 2026
ఏడుపాయల హుండీ ఆదాయం రూ.52.12 లక్షలు

ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం హుండీలు లెక్కించగా రూ.52.12 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం వీరేశం, ఎండోమెంట్ మెదక్ జిల్లా ఇన్ స్పెక్టర్ రంగారావు తెలిపారు. మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 56 రోజుల హుండీ లెక్కించారు. మిశ్రమ బంగారం 0.024 గ్రాములు, మిశ్రమ వెండి 000.927 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.


