News February 10, 2025

ప.గో: వేరు వేరు ఘటనల్లో నలుగురి ఆత్మహత్య

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఆదివారం వేరువేరు ఘటనల్లో నలుగురు సూసైడ్ చేసుకున్నారు. ద్వారకాతిరుమల తిమ్మాపురానికి చెందిన సోమశేఖర్ (42) కడుపునొప్పితో, పెదవేగిలోని రాట్నాలకుంటకు చెందిన మరియమ్మ కొడుకు కాలేజీ ఫీజుకోసం దాచిన సొమ్ముతో భర్త మద్యం తాగేశాడని సూసైడ్ చేసుకుంది. అలాగే అనారోగ్యంతో దొంగలమండపానికి చెందిన మాధవి విషం తాగింది. వారితో పాటు పాలకోడేరుకు చెందిన యడ్ల చంద్రశేఖర్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు.

Similar News

News March 16, 2025

NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

image

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.

News March 16, 2025

NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

image

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.

News March 16, 2025

హుజూర్‌నగర్‌లో నలుగురు నకిలీ ఎస్ఐలు అరెస్ట్

image

నలుగురు యువకులు గోల్డ్ షాప్ యజమానిని బెదిరించిన ఘటన HNRలో జరిగింది. పోలీసుల వివరాలు.. NLG జిల్లా నిడమనూరుకు చెందిన ప్రశాంత్, అక్షిత్, NLGకు చెందిన ఇరాన్, వాజిద్ APలోని కుప్పం SI డీపీని పెట్టుకున్నారు. HNRలో గోల్డ్ షాపు యజమానికి కాల్ చేసి నువ్వు దొంగల నుంచి గోల్డ్ కొన్నావు, జైలుకు పంపుతామని బెదిరించగా అతను భయపడి రూ.10 వేలు పంపాడు. అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.  

error: Content is protected !!