News April 24, 2024
ప.గో.: సిట్టింగ్ MLAలను పక్కన పెట్టారు.. గెలుపు సులువేనా..?

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప.గో. జిల్లాలో YCP, TDPలు చెరోస్థానంలో సిట్టింగ్ MLAలను కాదని ఇతరులకు కేటాయించాయి. 2019లో చింతలపూడి వైసీపీ MLAగా నియోజకవర్గ చరిత్రలో అధిక మెజారిటీ సాధించి గెలిచిన ఎలీజాను ఆ పార్టీ ఈ సారి పక్కనపెట్టి విజయరాజుకు అవకాశం ఇచ్చింది. ఉండిలో టీడీపీ MLA రామరాజును కాదని కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ RRRకు అవకాశమిచ్చింది. మరి ఈ 2చోట్ల ఆయా పార్టీల గెలుపు సులువయ్యేనా..?
– మీ కామెంట్..?
Similar News
News February 24, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
News February 24, 2026
ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.
News February 24, 2026
కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


