News April 24, 2024

ప.గో.: సిట్టింగ్ MLAలను పక్కన పెట్టారు.. గెలుపు సులువేనా..?

image

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప.గో. జిల్లాలో YCP, TDPలు చెరోస్థానంలో సిట్టింగ్ MLAలను కాదని ఇతరులకు కేటాయించాయి. 2019లో చింతలపూడి వైసీపీ MLAగా నియోజకవర్గ చరిత్రలో అధిక మెజారిటీ సాధించి గెలిచిన ఎలీజాను ఆ పార్టీ ఈ సారి పక్కనపెట్టి విజయరాజుకు అవకాశం ఇచ్చింది. ఉండిలో టీడీపీ MLA రామరాజును కాదని కూటమి అభ్యర్థిగా ఆ పార్టీ RRRకు అవకాశమిచ్చింది. మరి ఈ 2చోట్ల ఆయా పార్టీల గెలుపు సులువయ్యేనా..?
– మీ కామెంట్..?

Similar News

News January 16, 2025

ప.గో: మూడు రోజులు…రూ.1000 కోట్లు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన కోడి పందాలు కూడా ముగిశాయి. ఈసారి కోడిపందాలు భారీ స్థాయిలో జరిగాయి. మొత్తం 3 రోజులుగా కోడిపందాలు, గుండాట, పేకాట మొత్తం కలిపి సుమారు రూ.1000 కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.

News January 15, 2025

ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా

image

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.

News January 14, 2025

కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ

image

కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.