News December 29, 2024

ప.గో: ‘237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి’

image

ప.గో.జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

Similar News

News November 5, 2025

మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన “కౌశలం” సర్వేలో భాగంగా ఈనెల 6న నిర్వహించే మాక్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో వెబ్ క్యామ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 1,09,347 మందిని గుర్తించి, 535 సెంటర్లలో ఈ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తామని బుధవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

News November 5, 2025

‘గర్భగుడి వద్ద చెప్పులు’ ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

image

పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువ ఉందని ఆ హడావిడిలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి గుమ్మం బయట చెప్పులను వదిలి వెళ్లాడని, వెంటనే సిబ్బంది ఆ చెప్పులను తొలగించారన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, బాద్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News November 5, 2025

నరసాపురం: నేషనల్ లాన్ టెన్నిస్ పోటీలకు ఏంజిలిన్ ఎంపిక

image

నరసాపురానికి చెందిన గోడి స్పార్క్ ఏంజిలిన్ జాతీయ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలకు ఎంపికైంది. ఈ నెల 3న శ్రీకాళహస్తిలో జరిగిన రాష్ట్ర స్థాయి 14 ఏళ్ల లోపు బాలికల టెన్నిస్ విభాగంలో ఏంజిలిన్ మూడో స్థానం సాధించింది. దీంతో డిసెంబరులో హర్యానా రోహతక్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆమె అర్హత సాధించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం, క్రీడాభిమానులు అభినందించారు.