News March 22, 2024
ప.గో.: 24 ఓట్ల మెజారిటీతో MLAగా గెలుపు

పోలవరంలో 1999 అసెంబ్లీ ఎన్నికలు ఓ రికార్డు సొంతం చేసుకున్నాయి. అప్పుడు TDPనుంచి పోటీ చేసిన వంకా శ్రీనివాస రావు కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి బి.దుర్గారావుపై కేవలం 24 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పోలవరం చరిత్రలో ఇదే అత్యల్ప మెజారిటీ. 2019లో YCP నుంచి బరిలో నిలిచిన తెల్లం బాలరాజు ఎన్నడూ లేనంతంగా 42070 అత్యధిక మెజారిటీ సాధించగా ప్రస్తుతం ఆయన సతీమణి బరిలో ఉన్నారు. TDP- జనసేన- BJP కూటమి అభ్యర్థి తేలాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.
News December 19, 2025
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.
News December 19, 2025
తణుకు: లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

తణుకు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. పాత టోల్ గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం.


