News June 2, 2024

ప.గో: 3 రోజులు వైన్స్ బంద్.. మందుబాబుల క్యూ

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయనున్నారు. దీంతో మద్యం బాబులకు టెన్షన్ పట్టుకుంది. సోమవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేస్తుండటంతో ఆదివారమే మద్యం కొనుగోలు చేసేందుకు మందుబాబులు ఎగబడ్డారు. మరోవైపు లిక్కర్ మాల్స్ వద్ద మద్యం నిల్వలు నిండుకున్నాయి.

Similar News

News November 26, 2025

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News November 26, 2025

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News November 26, 2025

RRR కేసు.. ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌కు సిట్‌ నోటీసులు

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కస్టడీలో ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించారన్న కేసులో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు గుంటూరు సిట్ బుధవారం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 4న విచారణకు హాజరుకావాలని అందులో స్పష్టం చేసింది. 2021లో రాజద్రోహం కేసు విచారణ సమయంలో తనను కస్టడీలో హింసించి, హత్యకు కుట్ర పన్నారన్న రఘురామ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.