News June 12, 2024
ప.గో.: 35 ఏళ్ల తర్వాత.. నిమ్మల రికార్డ్

గత ఎన్నికల్లో ఉమ్మడి ప.గో. జిల్లాలో TDP 2స్థానాల్లో గెలుపొందగా అందులో పాలకొల్లు ఒకటి. 2019లో YCPప్రభంజనంలోనూ నిమ్మల రామానాయుడు 17809 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాజాగా మళ్లీ గెలిచి హ్యాట్రిక్ రికార్డ్ నమోదుచేసి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే పాలకొల్లు నుంచి 1989లో MLAగా గెలుపొందిన చేగొండి హరిరామ జోగయ్య మంత్రిగా సేవలందించగా.. దాదాపు 35ఏళ్ల తర్వాత ఇక్కడి నుంచి మంత్రి పదవి దక్కినట్లయింది.
Similar News
News March 25, 2025
‘గూడెం’ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.
News March 25, 2025
ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.
News March 25, 2025
పెంటపాడు: హత్య కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు.. జరిమానా

పెంటపాడు (M) ఆకుతీగపాడు గ్రామంలో ఆస్తి తగాదాలను కారణంగా చిన్నం శ్రీనివాస్ తన సోదరుడు వెంకటేశ్వర్లును హత్య చేశాడని స్థానిక ఎస్ఐ స్వామి తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా చిన్నం శ్రీనివాస్ను తాడేపల్లిగూడెం 11వ ఏడీజే కోర్టులో సోమవారం హాజరపరిచగా, నేరం నిరూపణ కావడంతో ఏడేళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ షేక్ సికిందర్ తీర్పు వెలువరించారు. పీపీ శివరామకృష్ణ సహకరించారన్నారు.