News March 29, 2024

ప.గో.: GREAT: 100 సార్లు రక్తదానం..

image

పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన చిర్రా గోపాల్‌ వందోసారి రక్తదానం చేశారు. తణుకులోని బ్లడ్‌ బ్యాంకులో శుక్రవారం ఆయన ఈమేరకు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. 18 ఏళ్ల వయసులో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న సమయంలో రక్తదానం చేసిన గోపాల్‌ అదే స్ఫూర్తితో 3 నెలలకోసారి రక్తదానం చేస్తూ ఇప్పటి వరకు వందమందికి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.

Similar News

News January 18, 2025

అభివృద్ధిపై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఉద్యాన పంటలు విస్తరణ, ఆక్వారంగం, పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రానున్న ఐదేళ్లలో లక్ష్యాల అమలు, ప్రగతిపై నిర్ధేశించిన కీ ఫెర్ఫార్మెన్స్ ఇండికేటర్ పై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు.

News January 17, 2025

ఏలూరులో ఈనెల 22 జాబ్ మేళా

image

ఈనెల 22న ఏలూరులో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మధు భూషణరావు శుక్రవారం తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. తిరుపతిలో ఉన్న పశ్చిమ ఆసియా‌లో అతి పెద్ద క్యాడ్బరీ చాక్‌లెట్ తయారీ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News January 17, 2025

జిల్లాలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివాస్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లాలో ప్రతి మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందని  కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో  జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు.