News October 7, 2024
ప.గో: TODAY TOP HEADLINES
*భీమవరం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
*తాడేపల్లిగూడెం: హత్య కేసులో నిందితుడు అరెస్ట్
*చింతలపూడి: పేకాట శిబిరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
*ప.గో: పేరుపాలెం బీచ్లో పర్యాటకుల సందడి
*ఏలూరు: వ్యక్తిపై దాడి చేసిన 9 మంది అరెస్ట్
*నరసాపురం: లారీని ఢీకొన్న RTCబస్సు.. సీసీ ఫుటేజ్
*తాడేపల్లిగూడెంలో యువకుడు మృతి
*ఉండి: లక్ష దాటిన బీజేపీ సభ్యత్వాలు
*500 రక్తపరీక్ష కిట్లను అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని
Similar News
News October 7, 2024
ఏలూరు జిల్లాలో యువతకు ఉచిత శిక్షణ
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు DLTC ప్రధానాచార్యుడు ఎస్.ఉగాది రవి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన కింద ఆఫీసు అపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కోర్సులో 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్ ఆపైన చదివిన వాళ్లు, 15 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News October 7, 2024
ఇసుకపై ఏలూరు జేసీ కీలక ప్రకటన
ఏలూరు జిల్లాలో ప్రస్తుతం నెలకు సరిపడా ఇసుక ఉందని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి వెల్లడించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జేసీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పట్టిసీమ, గూటాల, గూటాల-1 డీ-సిల్టేషన్ పాయింట్స్ ద్వారా త్వరలో ఇసుక అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఇసుక విషయంలో సమస్యలు ఎదురైతే 88865 42999, 95339 22444, 9493040757కు కాల్ చేయవచ్చని సూచించారు.
News October 7, 2024
ఏలూరు: మ్యాట్రిమోనిలో పరిచయం.. 4 పెళ్లిళ్లు.. చివరికి అరెస్ట్
మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని పెళ్లిచూపుల పేరుతో ఇప్పటివరకు 4 వివాహాలు చేసుకున్న ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డిని సోమవారం ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ రెడ్డితో పాటు సహకరించిన తుంగ శశాంక పల్లె హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.