News August 16, 2024

ప.గో.: YSR ఉద్యానవర్సిటీ ఉపకులపతిగా గోపాల్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్.కే.గోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా గోపాల్ పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది స్వాగతం పలికారు.

Similar News

News October 23, 2025

3,800 దరఖాస్తులు పెండింగ్‌పై జేసీ రాహుల్‌రెడ్డి ఆగ్రహం

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జాయింట్ ఎల్‌పీఎం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంప్ కార్యాలయం నుంచి రీ-సర్వే, హౌసింగ్ ఫర్ ఆల్, పీజీఆర్ఎస్ పిటిషన్ల పరిష్కారాలపై ఆయన గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇంకా 3,800 జాయింట్ ఎల్‌పీఎంలు పెండింగ్ ఉండటంపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.

News October 23, 2025

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల మార్జిన్‌లో, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.

News October 22, 2025

ప.గో: బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

ఎన్టీఆర్(D) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి గొర్రె అరవింద్(22) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం(M) దేవరపల్లికి చెందిన అరవింద్ మైలవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్‌లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.