News August 16, 2024

ప.గో.: YSR ఉద్యానవర్సిటీ ఉపకులపతిగా గోపాల్

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెం డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డాక్టర్.కే.గోపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా గోపాల్ పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు విశ్వవిద్యాలయ అధ్యాపక సిబ్బంది స్వాగతం పలికారు.

Similar News

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.