News June 14, 2024

ఫరూక్ మంత్రిగా పనిచేసిన శాఖలివే..!

image

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.

Similar News

News October 2, 2024

సెలవుల్లో విహారయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారా!

image

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహాయ యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వరం ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.

News October 2, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti

News October 2, 2024

కర్నూలు జిల్లా చరిత్రలో గాంధీ అడుగు జాడలు

image

భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti