News August 11, 2024

ఫలించిన ఎంపీ కడియం కావ్య కృషి

image

వరంగల్‌లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య చేసిన ప్రయత్నం ఫలించింది. వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కింద వెల్నెస్ సెంటర్ మంజూరు అయింది. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగులకు లాభం చేకూరుతుందని ఎంపీ కడియం కావ్య చెప్పుకొచ్చారు. ఎంపీకి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News

News December 17, 2025

గొల్లభామ తండా సర్పంచ్‌గా బాలు నాయక్

image

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

image

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్‌లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

చెన్నారావుపేట: సెల్యూట్.. జయరాజ్ పోలీస్ అన్న!

image

చెన్నారావుపేట మండలం బోజేరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ పని తీరుకు ప్రజలు సెల్యూట్ పోలీస్ అన్న అని మెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ పండు ముసలావిడ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఆమెను తన భుజాలపై పోలింగ్ కేంద్రంలోకి మోసుకు వెళ్లారు. ఈ దృశ్యం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.