News March 24, 2025

ఫారంపాండ్ కుంటలకు కేరాఫ్ ఆలూరు

image

జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఫారంపాండ్ నీటి కుంటలకు కేరాఫ్ ఆలూరు. 2014 ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం హయాంలో మండలంలోని పెద్దహోతూరు గ్రామం వద్ద పైలెట్ ప్రాజెక్టుగా వీటిని తవ్వించారు. వాటి ఉపయోగం గురించి అప్పట్లో రైతులకు అవగాహన సైతం కల్పించారు. ఈ ప్రాంతంలో నీటి కుంటలు విజయవంతమవడంతో రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కుంటల తవ్వకాలు చేపట్టారు. ఇక్కడి ఉపాధి సిబ్బంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీటిపై ట్రైనింగ్ ఇచ్చారు.

Similar News

News April 24, 2025

ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

image

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900,  సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్‌ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.

News April 24, 2025

క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్

image

జాతీయ స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఘనంగా సత్కరించారు. మే నెలలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే జాతీయస్థాయి కేడేట్, జూనియర్స్ విభాగాలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, కోచ్ షబ్బీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

News April 23, 2025

597 మార్కులు సాధించిన ఆదోని విద్యార్థిని.!

image

ఆదోని పట్టణంలోని ఎస్.కె.డి కాలనీకి చెందిన దేవరకొండ సలీమా పదో తరగతి ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచింది. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించింది. తండ్రి రంజాన్ బాషా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ పిల్లలను చదివించారు. తన కష్టానికి ఫలితంగా.. తన కూతురు మంచి మార్కులు సాధించి తమ గౌరవాన్ని నిలబెట్టిందని తండ్రి సంతోషించారు.

error: Content is protected !!