News August 31, 2024
ఫించన్ల పంపిణీ తీరును పరిశీలించిన కలెక్టర్

ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాల్లో ప్రారంభమైన ఎన్.టీ.ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు వృద్ధులు, వికలాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
మెలియాపుట్టి: టీచర్ సస్పెండ్

మెలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా ఉపాధ్యాయురాలిను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు.
News November 4, 2025
సంతబొమ్మాళి: ‘చిన్నారులకు ఇస్తున్న వ్యాక్సిన్పై నిర్లక్ష్యం తగదు’

చిన్నారులకు క్రమం తప్పకుండా ఇస్తున్న వ్యాక్సిన్పై నిర్లక్ష్యం తగదని DyDMHO డాక్టర్ మేరీ కేథరిన్ అన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి పీహెచ్సీ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎంల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 4, 2025
ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి: మంత్రి అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. కోటబొమ్మాళిలోని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలగాలన్నారు.


