News January 31, 2025

ఫిబ్రవరిలోపు పనులు పూర్తి కావాలి: తిరుపతి కలెక్టర్ 

image

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులలో  పురోగతి ఉండాలని, ఎలాంటి అలసత్యం వహించరాదని తిరుపతి కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కల్లెక్టరేట్ నుంచి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 

Similar News

News December 1, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నిలిచిన మీసేవ సేవలు

image

జిల్లాలోని మీసేవ కేంద్రాల్లో రెండు రోజులుగా సర్వర్ పనిచేయకపోవడంతో పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం కేంద్రాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి వేచి ఉండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికలు, విద్యా సంబంధిత అవసరాల కోసం వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

News December 1, 2025

గద్వాల్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలి

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 3వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇండోర్ స్టేడియంలో ఉదయం11;00 గంటలకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. ఆ రోజు వివిధ శాఖలచే ప్రతిపాదించబడిన దివ్యాంగ ఉద్యోగులను సత్కరించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యంగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

News December 1, 2025

నార్నూర్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

నార్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని జాదవ్ నరేష్ (18) ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్సై గణపతి తెలిపారు. జైనూర్ మండలం అందుగూడకు చెందిన సునీత, అన్నాజీ దంపతుల కుమారుడు నరేష్ నాలుగేళ్లుగా పాలేరుగా పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.