News February 5, 2025

ఫిబ్రవరి మొదటి వారంలోనే పెరిగిన ఉష్ణోగ్రత!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని గ్రామాలలో చలి తీవ్రత తగ్గుతూ.. ఎండ తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లాలో 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఈ విధంగా ఉంటే రానున్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News October 16, 2025

CCI కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలి

image

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. 2025- 26 పత్తి కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 16, 2025

కామారెడ్డి: రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం

image

కామారెడ్డి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది, ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

News October 16, 2025

NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

image

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్‌కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.