News January 30, 2025

ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు: కలెక్టర్

image

ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 10వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించవచ్చన్నారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 13వ తేదీలోగా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. 27వ తేదీ ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

News July 8, 2025

అల్లూరి జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

image

అల్లూరి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టింది. గడచిన 24గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిశాయి. వరరామచంద్రపురంలో అధికంగా 22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. ముంచంగిపుట్టు 16.4, హుకుంపేట 12.4, గూడెం కొత్తవీధి 10.2, జీ.మాడుగుల 8.6, చింతపల్లి 6.8, పెదబయలు 6.2, చింతూరు 6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందన్నారు. జిల్లాలో 255.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News July 8, 2025

YSRకు TPCC ఘన నివాళులు

image

TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర పార్టీ నేతలు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.