News April 13, 2025

ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలి:SP

image

ఎల్లారెడ్డి, తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ గస్తీ నిర్వహించాలన్నారు.

Similar News

News November 6, 2025

HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

image

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News November 6, 2025

సంగారెడ్డి: ఖోఖో సెలక్షన్ల తేదీలు మార్పు

image

సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ ఖోఖో సెలక్షన్స్ టోర్నమెంట్ తేదీల్లో మార్పు చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం సెక్రటరీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అండర్- 14, 17 విభాగాల బాలురకు ఈ నెల 11న, బాలికలకు 12న సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో హాజరు కావాలని కోరారు.

News November 6, 2025

అమ్మకానికి RCB.. మార్చి 31 నాటికి కొత్త ఓనర్!

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను <<18032689>>అమ్మకానికి<<>> ఉంచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైందని, 2026 MAR 31 నాటికి కొత్త ఓనర్ చేతుల్లోకి ఫ్రాంచైజీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో పేరెంట్ కంపెనీ Diageo (United Spirits Limited) ఈ విషయాన్ని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే వచ్చే IPL సీజన్‌లో కొత్త కంపెనీ ఆధ్వర్యంలో RCB ఆడే ఛాన్స్ ఉంది.