News February 5, 2025
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చాలా మండలాలలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉన్నాయని వాటినే త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News February 15, 2025
దుగ్గొండి: ‘ఈజీఎస్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 15, 2025
IMLT20 టోర్నీకి భారత జట్టు ఇదే

ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్లో ఆడే భారత జట్టుకు సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ ఈనెల 22న నవీ ముంబైలో భారత్VSశ్రీలంక మ్యాచుతో ప్రారంభం కానుంది.
భారత జట్టు: సచిన్, యువరాజ్, రైనా, రాయుడు, Y పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ, కులకర్ణి, వినయ్ కుమార్, నదీమ్, రాహుల్ శర్మ, పవన్ నేగి, నమన్ ఓజా, గుర్కీరత్, అభిమన్యు మిథున్.
News February 15, 2025
నల్గొండ: నేడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.