News February 25, 2025
ఫిర్యాదులను 1950 నంబరుకు తెలియజేయండి: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్లో సోమవారం MLC ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్షించారు. ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950 నంబరుకు తెలియపర్చవచ్చన్నారు. మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే సమాచారం అందించాలన్నారు. 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 71 జోనల్ అధికారులు, 99మంది రూట్ అధికారులను నియమించినట్లు చెప్పారు.
Similar News
News October 22, 2025
కరీంనగర్: భారత్ నుంచి పాల్గొన్న ఏకైక స్కాలర్

HZB(M) రాంపూర్వాసి శ్రీరాములు అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించి మన జిల్లా కీర్తిని చాటారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీరాములు మెల్బోర్న్ యూనివర్సిటీ OCT 21- 23 వరకు జరుగుతున్న స్వదేశీ సంస్థాగత అధ్యయనాల అంతర్జాతీయ అకాడమీ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు భారత్ నుంచి పాల్గొన్న ఏకైక పరిశోధకలు శ్రీరాములు.
News October 22, 2025
షరతులతో సందర్శనకు అనుమతి: అనకాపల్లి ఎస్పీ

రాజయ్యపేట గ్రామాన్ని సందర్శించే 48 మందికి వైసీపీ నాయకులకు షరతులతో అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ర్యాలీ, రోడ్ షో, భారీ సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశం నిర్వహించే సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేశారు.
News October 22, 2025
సినీ ముచ్చట్లు

*ప్రభాస్-హను రాఘవపూడి సినిమా థీమ్ను తెలుపుతూ కొత్త పోస్టర్ విడుదల. రేపు 11.07AMకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటన
*నవంబర్ 14న ‘డ్యూడ్’ ఓటీటీ విడుదలకు నెట్ఫ్లిక్స్ ప్లాన్!
*త్రివిక్రమ్-విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమాలో హీరోయిన్గా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపిక
*ముంబైలో శిల్పాశెట్టి రెస్టారెంట్.. రోజుకు రూ.2-3 కోట్ల ఆదాయం!