News March 15, 2025
ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు

కేంద్ర ప్రభుత్వం తనిఖీ చేసిన తరువాత వెలువరించే ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శనివారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివ రావు అసెంబ్లీలో చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి స్పందించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై సానుకూలంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News November 24, 2025
టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల: డీఈవో

2026 పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను డీఈవో చంద్రకళ ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు తమ వివరాలు పాఠశాల రికార్డుల్లో ఉన్న విధంగానే వెబ్సైట్లో సరి చూసుకోవాలి. తప్పులు సరి చేసుకోవడానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
నేడు GWMC కార్యాలయంలో ప్రజావాణి

నగర ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు GWMC ప్రధాన కార్యాలయంలో ప్రతీవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కౌన్సిల్ హాల్లో జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రకటించారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరై తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు.


