News November 27, 2024

ఫుడ్‌పాయిజన్‌ కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనం: కవిత

image

నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ జరగడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘X’ వేదికగా స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం తిని బాధ భరించలేక కడుపు పట్టుకుని రోదిస్తుండటం చూసి ఓ తల్లిగా తన మనసు కలచి వేసిందన్నారు. ప్రతి పదిరోజులకు ఒక పసి ప్రాణం పోతున్నా కూడా సర్కారులో చలనం లేదు. ప్రజా పాలన అంటే ఇదేనా..? అని ప్రశ్నించారు.

Similar News

News October 21, 2025

18 మంది అసువులు బాశారు: NZB CP

image

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని CP సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు.

News October 20, 2025

NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.

News October 20, 2025

NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

image

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.