News March 9, 2025
ఫైనల్లో పోరాడి ఓడిన శ్రీ సత్యసాయి జట్టు

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు నిరాశపరిచింది. సీనియర్ పురుషుల హాకీ ఫైనల్లో శ్రీ సత్యసాయి జట్టు తిరుపతి జట్టుతో పోరాడి ఓడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు 4-2తో ఓటమి చెందినట్లు సత్యసాయి జిల్లా హాకీ సెక్రెటరీ సూర్య ప్రకాశ్ తెలిపారు. జట్టును ముందుకు నడిపించిన కోచ్ హస్సేన్ను అభినందించారు.
Similar News
News January 7, 2026
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News January 7, 2026
ఖమ్మం: సీఎం సమక్షంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల చేరిక

ఖమ్మంలో బీఆర్ఎస్ ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. హైద్రాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. ఇటీవల కాలంలో ఐదుగురు చేరగా.. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్ బలంగా మారింది.
News January 7, 2026
విశాఖ: పరువు నష్టం దావా.. ఈనెల 21కి కేసు వాయిదా

తనపై ఓ పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా కేసులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు ఉదయం 11 గంటలకు కోర్టుకు రాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. చివరకు న్యాయమూర్తి ఈనెల 21కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.


