News September 4, 2024

ఫైల్స్ పెండింగ్ లేకుండ పూర్తి చెయ్యాలి: SP

image

జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలైన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ.. డీటీఆర్బీ పరిపాలన విభాగంలోని ABP సెక్షన్లు తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులు, నవీనీకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News October 18, 2025

బాణసంచా విక్రయదారులకు SP సూచన.!

image

అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేశారు. ఈ సందర్భంగా బాణసంచా విక్రయ కేంద్రాల్లో 18ఏళ్లలోపు పిల్లలను పనిలో ఉంచరాదన్నారు.

News October 18, 2025

పెద్దారవీడు: పేకాట ఆడివారికి 2 రోజులు శిక్ష

image

మండలంంలోని రేగుమానుపల్లి గ్రామ పొలాల్లో పేకాట శిబిరంపై సెప్టెంబర్ ఆరవ తేదీ పోలీసులు దాడి చేశారు. 14 మందిని అదుపులోకి తీసుకొని వారివద్ద ఉన్న రూ.1,09,910లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం 14 మంది ముద్దాయిలకు మార్కాపురం జడ్జి బాలాజీ విచారించి ఒక్కొక్కరికి రూ.300 జరిమానా 2 రోజులు సాధారణ జైలుశిక్ష విధించినట్లు ఎస్సై సాంబశివయ్య తెలిపారు.

News October 18, 2025

ప్రకాశం: ‘15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యం’

image

ప్రకాశం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను రూ.15వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో జేసీ సంబంధిత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే అవసరమగు ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.