News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. తూ.గో. జిల్లా మంత్రి కందుల దుర్గేష్‌కు 2వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

Similar News

News February 13, 2026

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

image

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

News February 13, 2026

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే బత్తుల భేటీ

image

సీఎం చంద్రబాబుతో రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల అనంతరం భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. 2027 పుష్కరాలకు రాజానగరం నియోజకవర్గానికి ప్రాధాన్యత నిచ్చి తగిన నిధులు కేటాయించాలని, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. వాటిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

News February 12, 2026

గోదావరి పుష్కరాలు.. ట్రాఫిక్ మళ్లింపుపై కలెక్టర్ పరిశీలన

image

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.