News March 16, 2025
ఫొటో మార్పింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీతక్క

సోషల్ మీడియాలో తన ఫొటో మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర భావజాల నియంత్రణకు ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని సీతక్క కోరారు.
Similar News
News March 17, 2025
కైలాసగిరిపై దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి

కైలాసగిరిపై ఏప్రిల్ నాటికి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తామని వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ ప్రణవ్ గోపాల్, ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీచ్ రోడ్డులో హెలికాప్టర్ మ్యూజియం, సిరిపురంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
News March 17, 2025
అందుకే తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు: రేవంత్ రెడ్డి

TG: పొట్టి శ్రీరాములు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత విముక్తికి పోరాడిన గొప్ప వ్యక్తుల పేర్లను యూనివర్సిటీలకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు వర్సిటీలకు పేర్లు మార్చినట్లు గుర్తు చేశారు. ఆ కోవలోనే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించామన్నారు.
News March 17, 2025
BREAKING: మోదీ పాడ్కాస్ట్ షేర్ చేసిన ట్రంప్

ప్రధాని నరేంద్రమోదీపై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అభిమానం చాటుకున్నారు. US పాడ్కాస్టర్, AI పరిశోధకుడు లెక్స్ ఫ్రైడ్మన్కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ వీడియోను తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఈ పాడ్కాస్ట్లో RSSతో అనుబంధం, భారత్కు నిర్వచనం, సంస్కృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ పాలన సహా అనేక అంశాలపై మోదీ తన అభిప్రాయాలు పంచుకున్నారు.