News January 29, 2025

ఫోటోగ్రపీలో కోనసీమ యువకుడు ప్రతిభ

image

ఈనెల 27,28 తేదీల్లో సఖినేటిపల్లి ప్రొఫెషనల్ ఫోటో,వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్వర్యంలో కేశనపల్లి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన కాకర రవితేజ తీసిన ఫోటోకు బంగారు పథకం లభించింది. రెండు రోజులపాటు జరిగిన ఈవర్క్ షాప్ లో సుమారు 40 మంది పాల్గొన్నారు. ఫోటో గ్రాపర్స్ అసోసియేషన్ నాయకులు రవితేజకు బంగారు పథకం అందజేశారు.

Similar News

News February 17, 2025

ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

image

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

News February 17, 2025

RECORD: 84 ఏళ్ల కాపురం.. 100+ గ్రాండ్ చిల్డ్రన్

image

దాంపత్యంలో చిన్న విభేదాలకే విడిపోతున్న ఈ రోజుల్లో 84ఏళ్ల తమ కాపురంతో రికార్డు సృష్టించిన ఓ జంట అందరికీ స్ఫూర్తినిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన మనోయిల్(105), మరియా(101)కు 1940లో పెళ్లయ్యింది. వీరు 13మంది పిల్లలు, 55మంది మనవళ్లు, మనవరాళ్లు, 54మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, 12మంది గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్స్‌ను చూశారు. ఒకరిపై ఒకరికి గల ప్రేమ, నమ్మకం వల్లే అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతున్నారు.

News February 17, 2025

GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

image

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్‌లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

error: Content is protected !!